డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

On
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

IMG-20260706-WA0799
ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన భాగ్యమ్మ..

డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

రంగారెడ్డి, జూలై 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: తన పేరుపై కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం వేసి, కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సబితా నగర్‌కు చెందిన భాగ్యమ్మ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో కుటుంబానికి చెందిన సామగ్రితో పాటు పిల్లల పాఠశాల యూనిఫామ్‌లు కూడా ఉండిపోవడంతో తన నలుగురు పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి పీఏ సూచించినప్పటికీ ఇంట్లోకి అనుమతించడం లేదని, పైగా ఇంటి పట్టా రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, వెంటనే ఇంటి తాళాలు తెరిపించి తమను ఇంట్లోకి అనుమతించాలని, న్యాయం చేయాలని జిల్లా అధికారులను వేడుకుంది. ఈ ఫిర్యాదుపై అధికారులు స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె కోరింది.

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన.. డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన భాగ్యమ్మ.. డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన.. రంగారెడ్డి, జూలై 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: తన పేరుపై...
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ