కుట్రపూరితంగానే చంద్రన్నపై అక్రమ కేసులు:ముత్తుముల

On
కుట్రపూరితంగానే చంద్రన్నపై అక్రమ కేసులు:ముత్తుముల

గిద్దలూరు న్యూస్ ఇండియా

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరులో రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని క్లబ్ రోడ్డులో నిరాహార దీక్ష చేపట్టిన పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముత్తుముల సంఘీభావం తెలియచేశారు. ఈ సందర్భంగా ముత్తుముల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రాబోవు ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించిందని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని మరచి అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేయడమే పనిగా పెట్టుకుందని వైసిపి చేస్తున్న దుర్మార్గపు చర్యలు ఎన్నో రోజులు నిలువవని రాబోవు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపనున్నారన్నారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ పెద్ద మస్తాన్, పార్లమెంట్ నాయకులు షేక్ మహబూబ్ బాషా, గోపిరెడ్డి జీవనేశ్వర రెడ్డి, యామా సంజయ్, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, కటికే యోగానంద్, బీసీ నాయకులు పందిల్లపల్లి శ్రీనివాసులు, బొజ్జా రంగనాధ్, ఎలిశెట్టి వెంకటప్ప, మోడీగారి కృష్ణ, నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు, మాజీ కౌన్సిలర్ మండ్ల శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు షేక్ మదార్ వలి, అనీఫ్, బాబాయ్, కంచర్ల కిరణ్, చిలకల రమణ, గువ్వల రంగనాయకులు, సతీష్, వడ్లమాని సుబ్బారాయుడు, బాలుడు, మహిళా నేతలు చిటికెన లలిత, షేక్ ఫాతిమా, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గోన్నారు.IMG-20230923-WA0280

Views: 95
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News