దేశ ప్రజలంతా మహాత్మా గాంధీ బాటలో నడవాలి..
ఇబ్రహీంపట్నం టీపీసీసీ సభ్యులు, ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులు దండం రామ్ రెడ్డి
దేశ ప్రజలంతా మహాత్మా గాంధీ బాటలో నడవాలి..

ప్రతి ఒక్కరూ మాత్మ గాంధీ బాటలో నడవాలి అని ఇబ్రహీంపట్నం టీపీసీసీ సభ్యులు ప్రచార కార్యనిర్వాహక సభ్యులు దండం రామ్ రెడ్డి అన్నారు. సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పెద్ద అంబర్పేట్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యం, అహింస సిద్ధాంతాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని వారి బాటలో దేశ ప్రజలంతా నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న చిరంజీవి, కౌన్సిలర్లు దండం కృష్ణారెడ్డి, పసుల రాజేందర్ ముసురాజ్, శ్రీధర్ రెడ్డి, కోమటి వెంకయ్య, గుడిపాటి శ్రీనివాస్, పారేపల్లి నరసింహ, రమేష్, చందు, సురకంటి రాజశేఖర్ రెడ్డి, సేవాదళ్ చైర్మన్ రాంబాబు, మున్సిపల్ ఎన్.ఎస్.యు.ఐ ప్రెసిడెంట్ భరత్, లక్ష్మణ్, ప్రణవ్, మనోహర్, మనీష్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List