మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ కుసంగీ గ్రామం లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం

మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ కుసంగీ గ్రామం లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం

మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ కుసంగీ గ్రామం లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అద్యక్షుడు భక్తుల వీరప్ప మరియు టేక్మల్ ప్రదాన కార్యదర్శి అవినాష్ జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ విక్రమ్ గౌడ్, కుసంగీ గ్రామ పార్టీ అద్యక్షుడు లక్ష్మయ్య, మొగుల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మల్లయ్య టేక్మాల్ మండల్ బీఆర్ యస్ వి ప్రధాన కార్యదర్శి లింగమయ్య, కుసంగి గ్రామ వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు పార్టీ కార్యకర్తలు, క్రాంతి సేన మిత్రులు పాల్గొన్నారు... ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కార్యక్రమాలు, బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రతి గడపకు వెళ్లి వారికి క్లుప్తంగా వివరించి చెప్పాలని అన్నారు.... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ కు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని టేక్మాల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు భక్తుల వీరప్ప అన్నారు... గ్రామానికి మరింత అభివృద్ధి చెందేలా మా వంతు కృషి చేస్తామని ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని భక్తుల వీరప్ప హామీ ఇచ్చారు... ఈ కార్యక్రమంలో జోగిపేట వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు సార్వత్రిక ఎన్నికలలో కుసంగి గ్రామం నుండి బీఆర్ ఎస్ పార్టీ కే మెజార్టీ వచ్చిందని, ఈసారి కూడా అంతకు మించిన మెజార్టీతో ఎమ్మెల్యే గా క్రాంతన్న ను గెలిపించాలని విక్రమ్ గౌడ్ కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Views: 62

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత