నకిలీ పట్టాలతో మోసగిస్తున్న ముద్దాయిలకు కోర్టు నందు శిక్ష పడేలా కృషి చేసిన ఎస్సై నాగమల్లేశ్వర రావు
మోసపోయిన రైతులు ఎస్సై నాగమల్లేశ్వర రావు కు ప్రత్యేక కృతజ్ఞతలు
అర్థవీడు న్యూస్ ఇండియా
అర్ధవీడు మండల పరిదిలో నకిలి పట్టాలు పాస్ బుక్ లు తయారుచేసి రైతులను మోసం చేస్తున్నారని స్థానిక ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదు ను బట్టి ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు,మార్కాపురం ఎస్పీ, కంభం సిఐ ఎం.రాజేష్ కుమార్ సూచనలతో అర్ధవీడు ఎస్సై వి.నాగ మల్లేశ్వర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.అనంతరం కేసు దర్యాప్తులో బాగంగా ముద్దాయిలు అయిన దద్దనాల కృష్ణారెడ్డి, అన్నపు నాగరాజు, తొండమల వెంకట వరప్రసాద్ ( వెంకట ప్రసాద్ ), చిట్టేటి నాగరాజు, గుమ్మడాల శ్రీనివాసులు లను ఎస్సై వి.నాగ మల్లేశ్వర రావు

2023 నవంబర్ 22 న పాపినేనిపల్లి దారిలో గల జగదీశ్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ వద్ద అదుపులోకి తీసుకుని గిద్దలూరు న్యాయ స్థానం నందు హాజరుపరిచారు.దీంతో న్యాయ స్థానం ముద్దాయిలకు 14 రోజులు రిమాండ్ కి పంప్పినట్లు ఎస్సై వి.నాగమల్లేశ్వర రావు తెలిపారు.
Comment List