వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం

వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం

వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం

 

మహబూబాబాద్ జిల్లా IMG_20251023_165020 తొర్రూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పిపిసి కేంద్రాల (PPC Centres) పై సమీక్షా సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తహసీల్దార్ మాట్లాడుతూ — ప్రతి రైతు వరి ధాన్యం కేంద్రానికి వచ్చిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. తగినంత గన్నీ సంచులు ముందుగానే సిద్ధంగా ఉంచాలని, వరి ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు, చెక్క పొదలు అన్ని పిపిసి కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్, టెంట్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మద్దతు ధర వివరాలు రైతులకు స్పష్టంగా తెలియజేసేలా బోర్డులు ప్రదర్శించాలని, పిపిసి సెంటర్ ఇన్‌ఛార్జిలు తమ కేంద్రాలను వదిలి వెళ్లకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. తూకం వేసిన తరువాత ధాన్యం సంచుల రవాణా కోసం వాహన కాంట్రాక్టర్ ద్వారా తగినన్ని వాహనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దొడ్డువడ్ల ధాన్యాన్ని, సన్న వడ్ల ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రంలోని  వేర్వేరుగా  ఉంచేలా ఏర్పాట్లు చేయాలని, ప్రతి పిపిసి కేంద్రంలో తగినంత మంది కార్మికులు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి రామనర్సయ్య, ఎస్ఐ ఉపేందర్, సీఈఓ మురళి, డిటీ, ఆర్‌ఐ, జి.పి.ఓలు తదితరులు పాల్గొన్నారు...

Views: 21
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి