ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్ర పటానికి పాలాభిషేకం
On
న్యూస్ ఇండియా తెలుగు డిసెంబర్ 21(మందమర్రి చిలుక సంజీవ్):మందమర్రి పట్టణం లోని ఇందు గార్డెన్ లో అఖిల భారత యాదవ మహా సభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బండి సదానందం మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో యువతకు ఇచ్చిన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ మేరకు సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అవకాశం స్థానికులకే 80 శాతం కలిపించలని గెలిచిన 20 రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందించి జీవో వచ్చే విధంగా కృషి చేసినందుకు వివేక్ వెంకటస్వామి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి కొలెబెల్ట్ ప్రాంత యువతకి ఇది మంచి శుభచుకం అని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం మల్లేష్ , సెగ్గం రవికుమార్,రాంటెంకి సురేష్,సుద్దాల రాజుకుమార్,నీరేటి వెంకటేష్, చిప్పకుర్థి శశిధర్, పుప్పాల నరేందర్ మరియు గోపాతి శారద తదితరులు పాల్గొన్నారు. Views: 16
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
19 Apr 2026 18:07:28
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా ఏప్రిల్ 20, నుండి వారం రోజులు సంక్షేమ వారోత్సవాలు (సోమవారం మొదటి

Comment List