చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

Screenshot_20231226_202026~2

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గోకారం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన పబ్బు శ్రీరాములు (65) చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. రోజు మాదిరిగానే 24వ తేది ఆదివారం రోజున గ్రామంలోని మల్ల సముద్రం కుంటలో చేపలు పట్టుటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చేపలు పట్టే వల అతనికి చుట్టుకుని కుంటలో పడిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో 25వ తేదీ న అతని కోసం అంతటా గాలించిన ఫలితం లేకపోవడంతో 26వ తేదీన మల్ల సముద్రం కుంటలో శవమై తేలాడు. మృతునికి ఈత వచ్చిన కూడా వల చుట్టుకోవడంతో అతను మరణించాడు. మృతుని అల్లుని ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Views: 327
Tags:

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.