అంతరరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

అంతరరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

11,20,000/- రూపాయలు విలువ గంజాయి స్వాదినం

వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS


ఈరోజు అనగా తేదీ 20.07.2024 రోజున మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో  ఎస్.ఐ జగదీష్ మరియు సిబ్బందితో  దుబ్బ తండ దగ్గర ఉదయం 9 గంటల సమయాన వాహనాలను తనిఖీ చేయగా, ఒక బొలెరో వాహనం అనుమానాస్పదంగా, స్పీడ్గా వస్తుండగా అట్టి వాహనాన్ని ఆపి, అందులోని నలుగురు (ఇద్దరు మగ & ఇద్దరు ఆడ మనుషులు) పారిపోయేందుకు ప్రయత్నం చేయగా, వెంటనే వారిని అధువులోకి తీసుకొని వారి బొలెరో వాహనం చెక్ చేయగా, అందులో వెనకాల మూడు ప్లాస్టిక్ సంచులలో నిండా 33 ప్యాకెట్ల గంజాయి లభించింది.

Read More ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా,

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

1) ప్రహ్లాద్ సిసా, S/o జగబంధు సీసా, వయస్సు: 36 సంవత్సరాలు, ST-ఆదివాసి, R/O కాంతి గ్రామం, బాదెల్ పోస్ట్, పాడువ మండలం, కోరాపుట్ జిల్లా, ఒడిసా రాష్ట్రం,

Read More ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

2) అప్పన్న బైరాగి, S/o Mngu బైరాగి, వయస్సు; 36 సంవత్సరాలు, కులం ST ఆదివాసి, బోక్ మెకానిక్, R/ ౦ కితుబా గ్రామం, బార్డేల్ పోస్ట్, కొరాపుట్ జిల్లా, ఒడిసా రాష్ట్రం,

3) మిథులా సిసా, D/o సోను సినా, వయస్సు: 21 సంవత్సరాలు, R/O మహదా గ్రామం, బలేల్ పోస్ట్, మాచ్ కుడా ఉప జిల్లా, కోరాపుట్ జిల్లా.

4) బసౌతి పాంగి, D/o పడలం పాంగి, మహదా గ్రామం, బలేల్ పోస్ట్, మచ్కుడ ఉప జిల్లా, కోరాపుట్ జిల్లా. అని తెలపడం జరిగింది.గత ఇటీవల ప్రభుత్వ నిషేదిత గంజాయి వ్యాపారం చేస్తున్నాను,తరుచుగా ఒరిస్సా నుండి తెలంగాణ హైదరాబాదులో అమ్ముకుంటామని, అదే విధంగా ఈ రోజు కూడా గంజాయి ప్యాకెట్లను ఒడిస్సా నుండి తీసుకుని రాజమండ్రి విజయవాడ, కోదాడ సూర్యాపేట దంతాలపల్లి మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

వీరి వద్ద మొత్తం గంజాయి సుమారుగా 60 కిలోల విలువ సుమారుగా రూ. 11,20,000/- రూపాయలు(Per Kg 20000/-) ఉంటుంది. గంజాయి తరలించడానికి వాడిన బొల్లెరో టర్బో బేరింగ్ నెం: AP39G3761 ను మరియు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనపర్చుకొని నిందితులను రిమాండుకు తరలించడం జరిగింది.

చాకచక్యం గా వ్యవహరించిన గంజాయి నిందితులను పట్టుకున్న ఎస్.ఐ జగదీష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.

మీడియా సమావేశంలో తొర్రుర్ సీఐ సంజీవ, ఎస్.ఐ జగదీష్, దంతాలపల్లి ఎస్.ఐ రాజు, ఎస్.ఐ క్రాంతి కిరణ్, సిబ్బంది ఉన్నారు.

Views: 168
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓజోన్ హాస్పటల్లో దారుణం..  ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. ఓజోన్ హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా చేశారు.
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ