పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి లబ్బిదారులకు అందచేసారు.పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన 51 మంది బాధితులకు మంజురైన 11 లక్షల 81 వేల ఐదు వందల రూపాయలు (11,81,500) రూ. చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి లబ్బిదారులకు అందచేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతు ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్ని రెడ్డి అన్నారు.ప్రజా సంక్షేమం కోసం.. ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు.దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రములో ప్రజల కోసం పథకాలను రూపకల్పన చేసిన సిఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి అన్నారు.సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి కి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు హమ్యా నాయక్, రాపాక సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సోమా రాజశేఖర్, మండల అధ్యక్షులు సుంచు సంతోష్, రవీందర్ రెడ్డి, సురేష్ నాయక్, గిరగాని కుమారస్వామి, ముద్దసాని సురేష్, నల్ల శ్రీరామ్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు, పాల్గొన్నారు..

Views: 55
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్! ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?