ప్రభుత్వ భూములను పరిరక్షించాలి: కలెక్టర్ శశాంక.

On
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి: కలెక్టర్ శశాంక.

లేఅవుట్ రూల్స్ రెగ్యులరైజేషన్, 2020 - అన్ని ULBలలో LRS అప్లికేషన్‌ల ప్రాసెసింగ్ పై జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి: కలెక్టర్ శశాంక..

రంగారెడ్డి, ఆగస్ట్ 08 (న్యూస్ ఇండియా ప్రతినిధి): బుధవారం లేఅవుట్ రూల్స్ రెగ్యులరైజేషన్, 2020 - అన్ని ULBలలో LRS అప్లికేషన్‌ల ప్రాసెసింగ్ పై జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ అధికారులతో సమావేశం

Screenshot_2024-08-08-07-03-11-43
లేఅవుట్ రూల్స్ రెగ్యులరైజేషన్, 2020 - అన్ని ULBలలో LRS అప్లికేషన్‌ల ప్రాసెసింగ్ పై జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ అధికారులతో సమావేశం

నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. G.O.Ms.No.131, MA&UD (P3) డిపార్ట్‌మెంట్ 31 ఆగస్ట్ 2020 2. G.O.Ms.No.135, MA&UD (P3) డిపార్ట్‌మెంట్ 16 సెప్టెంబర్ 2020 ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా క్రమబద్ధీకరణ ఛార్జీల చెల్లింపుపై అనధికారిక ప్లాట్లు/ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన విధానం పై మున్సిపల్ అధికారులతో చర్చించారు. LRS అప్లికేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి CGG ద్వారా పారదర్శక ఆన్‌లైన్ సాధనం రూపొందించాలన్నారు. ప్రభుత్వ భూములు మొదలైన వాటిలో ప్లాట్లు / లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు పైన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమిష్టిగా  కార్యచరణ రూపొందించుకోని పని చేయాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో  ఉన్న లేఅవుట్ల  క్రమబద్ధీకరణ మున్సిపల్ కమీషన్లరకు, మున్సిపల్ పరిధిలో లేనివి జిల్లా కలెక్టర్ పరిధిలోకి వస్తాయన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ లో ప్లాట్ క్రమబద్ధీకరణకు మూడు స్థాయిల పరిశీలనలు చేయాలన్నారు. అందులో భాగంగా లేఅవుట్ క్రమబద్ధీకరణకు కావాల్సివి నాలుగు అంచెలు ఉంటాయన్నారు.  స్థాయి-0: CGG ద్వారా సిస్టమ్ బేసుడు ఫిల్టరైజేషన్, లెవెల్-1: మల్టీడిసిప్లినరీ టీమ్‌ల ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్,  స్థాయి-2: CPO/TPO (సెక్షన్ హెడ్) / DPO,   స్థాయి-3: మున్సిపల్ కమీషనర్, వైస్ ఛాన్స్లర్,  అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ, కలెక్టర్ లోకల్ బాడీస్ ద్వారా ఆమోదించబడుతాయని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, భూపాల్ రెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, ఆర్డీఓలు సూరజ్ కుమార్, అనంత రెడ్డి, వెంకట్ రెడ్డి, సాయిరాం, వేణుమాధవ్, తహశీల్దారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

Views: 42

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..