సిపిఎస్ అంతం..మన పంతం: మాచన

సిపిఎస్ అంతం..మన పంతం: మాచన
ఎల్బీనగర్, సెప్టెంబర్ 07 (న్యూస్ ఇండియా ప్రతినిధి): భాగస్వామ్య పింఛను పథకం ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరణ చేసే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ పునరుద్ఘాటించింది. సెప్టెంబర్ 16 న యూపిఎస్, ఎన్పీఎస్ ల రద్దు కోరుతూ జరుప తలపెట్టిన భారీ సదస్సు కోసం ఆదివారం నాడు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రతినిధులతో సన్నాహక జూమ్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఓపిఆర్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ..న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయం వరకు గళం వినిపించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు సన్నాహక సమావేశంలో తమ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నెల 15 న కొత్త ఢిల్లీ కి వెళ్ళ నున్నట్టు రఘునందన్ తెలిపారు.

About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List