కోదండ రెడ్డి నియామకం హర్షనీయం..

ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి..

On
కోదండ రెడ్డి నియామకం హర్షనీయం..

కోదండ రెడ్డి నియామకం హర్షనీయం..

ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి..

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 10 (న్యూస్ ఇండియా ప్రతినిధి): కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి కి వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా నియమితులైన శుభ సందర్భంగా మంగళవారం వారి నివాసంలో టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యేగా, జాతీయ కిసాన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా సేవలు అందించి   తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా నియమింపబడినందుకు టీపీసీసీ సభ్యులు ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి జాతీయ &  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కోదండ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం పై  రైతుల పక్షాన ఏనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. పేద ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన అండగా నిలిచారని అన్నారు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమింపజేయడం అర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, యాచారం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు దెంది రామిరెడ్డి, సీనియర్ నాయకులు పాండాల యాదయ్య గౌడ్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 92

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..