బంగారం చోరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

కేసుకు కీలకంగా మారిన సీసీ పుటేజులు

On
బంగారం చోరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

5 తులాల బంగారం ,3సెల్ ఫోన్లు,28000 నగదు రికవరీ వివరాలు వెల్లడించిన డిఎస్పి

చుంచుపల్లి (న్యూస్ ఇండియానరేష్) 22: బంగారు చోరీ కేసులో నలుగురు నిందితులను చుంచుపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా బంగారం చోరీ కేసును చాకచక్యంగా చేదించినట్లు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పి వివరాలు తెలుపుతూ.. అక్టోబర్ 9 వ తారీఖున రైటర్ బస్తీకి చెందిన వెంకటేశ్వర్లు అనే రిటైర్డ్ ఎంప్లాయ్ దసరా పండుగ సందర్భంగా బ్యాంకు లాకర్ లో ఉన్న 19 తులాల బంగారాన్ని విడుదల చేసుకున్నాడు. అనంతరం దారిలోని విద్యానగర్ కాలనీలోని ఆర్కే సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపి కిరాణా సామాన్ తీసుకొని వచ్చి వెనుక వైపు డిక్కీ ఓపెన్ చేసి కిరాణా సామాన్లు పెడుతుండగా అదే అదునుగా భావించిన తంబాల నితిష్, మరో ముగ్గురు సహాయంతో ఆటోలో వచ్చి, కారు డోర్ ఓపెన్ చేసి కార్ లో ఉన్న బంగారాన్ని అపరించుకొని అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం కారులో బంగారం చోరీకి గురిందని గమనించిన వెంకటేశ్వర్లు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.రంగంలో దిగిన పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి కదలికల పై నిఘా ఉంచి చాకచక్యంగా మంగళవారం అరెస్టు చేశారు .తంబాల నితిన్ తో పాటు నిమ్మల వినయ్, గుంజి వీరబాబు, మహమ్మద్ నయీమ్, అదుపులోకి తీసుకొని విచారించగా ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసిన 19 తులాల బంగారంకీ గాను , 5 తులాల బంగారం,3 సెల్ ఫోన్లో, 28000 నగదును రికవరీ చేసి, నిందితులను రిమాండ్ పంపినట్లుగా డిఎస్పి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలొ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ప్రవీణ్ ,రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Views: 220
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'