అభినందన సంచిక గురు సత్కారం

*రామచంద్రామృతం* అనే పేరుతో సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం

By Venkat
On
అభినందన సంచిక గురు సత్కారం

సత్కారం అందుకున్న భుజేoధర్

IMG-20250203-WA0086ఆదివారం రోజున యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ వేడుకల మందిరంలో కవి సౌజన్య,వ్యాసాల వ్యాసుడు, మహా ఉపాధ్యాయుడు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర 80 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా *రామచంద్రామృతం* అనే పేరుతో సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బమ్మెర గ్రామవాసి శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేoదర్ ను గురువర్యులు, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర దంపతులు, మరియు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి శాలువాతో సన్మానించి రామచంద్ర అమృతం పుస్తకం, జ్ఞాపికతో సత్కరించారు. గురు సత్కారం అందుకున్నందుకు బుజేందర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పోరెడ్డి రంగయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. సభా అధ్యక్షత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి వహించారు. ముఖ్య అతిథులుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కుడుదుల నాగేష్, మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఆచార్య బన్న ఐలయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి నామోజు బాలా చారి, జనగామ, యాదాద్రి కవులు, రామచంద్ర సార్ శిష్యులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 16
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు