సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ఎల్బీనగర్, మే 13, న్యూస్ ఇండియా ప్రతినిధి: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మంగళవారం డివిజన్ లోని ఆర్టీసీ మజ్దూర్ కాలనీ లో నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులను కాలనీవాసులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు కార్పొరేటర్ ని ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా కాలనీలో మిగిలి ఉన్న వీధుల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కార్పోరేటర్ కి కాలనీవాసులు విజ్ఞప్తి చేయడంతో వారు వెంటనే స్పందించి, డివిజన్లోని ప్రతి ఒక్క కాలనీ అభివృద్ధి చేయడం తన యొక్క బాధ్యతని, రానున్న రోజుల్లో కూడా ఆర్టీసీ మజ్దూర్ కాలనీ మరింత అభివృద్ధి పరిచేలా కృషి చేస్తానని కాలనీవాసులకీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మజ్దూర్ కాలనీ అధ్యక్షులు సూర్య, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, జంగయ్య, రామకృష్ణ, వి.వి.ఎన్ రెడ్డి, మూర్తి, నర్సింగ్, నారాయణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Comment List