చికెన్ బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను అని రెస్టారెంట్ యజమాని...

On
చికెన్ బిర్యానిలో బల్లి..

బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను... రెస్టారెంట్ యజమాని..

IMG-20250515-WA0635
బిర్యానీలో బల్లి..

ఇబ్రహీంపట్నం, మే 15, న్యూస్ ఇండియా ప్రతినిధి: రెస్టారెంట్ లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు/ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రం సాగర్ రోడ్డు లో ఉన్న మై పిల్ ప్యామిలీ రెస్టారెంట్ లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణ రెడ్డి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోగా వచ్చిన తర్వాత బిర్యానీ ని తినడం మొదలుపెట్టారు. బిర్యానీ లో బల్లి కనిపించడం తో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. తర్వాత తేరుకొని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నిలదీయగా ఆయన మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు 100 డయల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెస్టారెంట్ మేనేజర్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Views: 30

About The Author

Post Comment

Comment List

Latest News

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
ఖమ్మం మార్చి 1 ఖమ్మం న్యూస్ ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా భారత మాజీ...
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 
కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు