ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ఖమ్మం, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్.
ఖమ్మం, మేర యువ భారత్ ఆధ్వర్యంలో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు, ఖమ్మం మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి చెందిన గొప్ప రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. ఆయన 1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి అశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్గా పనిచేశారు. శ్యామా ప్రసాద్ కూడా 33 సంవత్సరాల వయస్సులో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్గా పనిచేశారు. ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు మొదటి మరియు ద్వితీయ బహుమతులు ఇచ్చి, విద్యార్థులతో ర్యాలీ తీయించడం జరిగింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List