డిజిటల్ రూపీ..హ్యాపీ

On

భారత ఆర్థిక రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. డిజిటల్‌ రూపాయి వచ్చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ తొలి పైలట్‌ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండో దశలో భాగంగా మరో 9 నగరాలకు (హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, ఇండోర్‌, కొచ్చి, లఖ్‌నవూ, పాట్నా, సిమ్లా) […]

భారత ఆర్థిక రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. డిజిటల్‌ రూపాయి వచ్చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ తొలి పైలట్‌ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభించింది.

సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
రెండో దశలో భాగంగా మరో 9 నగరాలకు (హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, ఇండోర్‌, కొచ్చి, లఖ్‌నవూ, పాట్నా, సిమ్లా) సేవలను విస్తరించనునన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుల్లో లావాదేవీలకు అవకాశం కల్పించారు.

మరో 4 బ్యాంక్‌లకు వీటి జారీ బాధ్యతలను అప్పగిస్తారు. అవసరానుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని నగరాలకు సేవలను విస్తరించడంతో పాటు ఇతర బ్యాంక్‌ల ద్వారానూ డిజిటల్‌ రూపాయిని అందుబాటులోకి తేవడం జరుగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.