డా|| వకుళాభరణంకు మహాత్మా జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కారం

On
డా|| వకుళాభరణంకు మహాత్మా జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కారం

డా|| వకుళాభరణంకు మహాత్మా జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కార జ్ఞాపికను అందజేసిన “తానా” తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా -TANA) జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కారం, జ్ఞాపికను అందచేసింది. సామాజిక సేవా రంగంలో విశిష్ఠ సేవలు అందిస్తున్న వారికి ఈ పురస్కారం ఇవ్వాలని “తానా” నిర్ణయించి, తొలి అవార్డును డా|| వకుళాభరణంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఈ యేడాది జూలై 7,8,9 తేదీలలో) అమెరికా లోని ఫిలడెల్ఫియాలో జరిగిన 23వ తానా మహాసభలలో డాక్టర్ వకుళాభరణం విశిష్ఠ అతిథిగా పాల్గొన్నారు. కాగా, సాంకేతిక కారణాలతో అప్పుడు పురస్కారం, జ్ఞాపికను అందజేయలేకపోయారు. ఈ నేపథ్యంలో (అప్పటి) తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు సూచనలతో ఈ విశిష్ఠ పురస్కార జ్ఞాపికను తానా ప్రతినిధిగా, ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు డా|| ప్రసాద్ తోటకూర గురువారం నాడు నగరంలో డా|| వకుళాభరణం కు అందజేశారు. ఈ భేటీ, జ్ఞాపిక ప్రధానం ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలోని ఛైర్మన్ డా|| వకుళాభరణం ఛాoబర్స్ లో జరిగింది. ఈ సందర్భంగా డా|| ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ... వకుళాభరణం లాంటి గొప్ప సామాజికవేత్తకు ఈ పురస్కార జ్ఞాపికను మాతృ దేశానికి వచ్చి తన చేతుల మీదుగా అందచేయడం సంతోషంగా ఉందన్నారు. తానా మహా సభలలో బహుజన వర్గాల ప్రతినిధిగా కృష్ణ మోహన్ ప్రసంగం అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించిదని తెలిపారు. ఆయన లోని సామాజిక స్ఫూర్తి, అంకిత భావం, మూడున్నర దశాబ్దాలుగా ప్రధానంగా బీసీ వర్గాల నిమిత్తం చేస్తున్న కృషి అభినందనీయయమైనదన్నారు. డా|| వకుళాభరణం మాట్లాడుతూ... సామాజిక వేత్తలకు “తానా” తొలి సారిగా ప్రకటించిన ఫూలే పురస్కారంను తనకు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు తనలో మరింత బాధ్యతను పెంచిందన్నారు. పురస్కార జ్ఞాపికను స్వయంగా అందచేయడానికి డా|| ప్రసాద్ తోటకూరను తానా ఇక్కడికి (హైదరాబాద్) పంపించి అందచేయడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర అధ్యక్షులు, ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక పూర్వ అధ్యక్షులు – తానా మొబైల్ నెo.+1 (817) 300 - 4747

Screenshot_20230921-152739-133

Views: 49
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..