*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని వికాస్ హై స్కూల్ కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు.

 డివిజన్ కేంద్రంలోని వికాస్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు.

     విద్యార్థులకు నమూనా పోలింగ్‌ నిర్వహించి, తద్వారా ఓటింగ్‌, ఎన్నికల విధానం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. తొర్రూరు కౌన్సిలర్లు పలువురు విద్యార్థులు నామినేషన్లు వేయడంతో పాటు బ్యాలెట్‌ పేపరు ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్ని కల్లో గెలుపొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవ గాహన కల్పించారు. ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది.

        ఈ సందర్భంగా కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ... ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన అవసరమని, భవిష్యత్తులో విద్యార్థులే దేశానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఎన్నికల విధానం తెలియడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ రేవూరి వెంకన్న, డైరెక్టర్ కేవీ రెడ్డి, విజయభాస్కర్, శ్రీలత, ప్రిన్సిపాల్ వేణుమాధవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు