బాబు కి తోడుగా ఒక నియంత పాలన పై పోరాటం కోసం

ముత్తుముల సమక్షంలో సర్పంచులు,మాజీ సర్పంచులు వైసీపీని వీడి టీడీపీలో చేరిక

On
బాబు కి తోడుగా ఒక నియంత పాలన పై పోరాటం కోసం

గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం,సంజీవరావుపేట సర్పంచ్ బుడత ఓబులమ్మ,కొంగలవీడు సర్పంచ్ పందనబోయిన లక్ష్మీప్రసన్న మరియు అంకాల లక్ష్మి నారాయణ జయరాంపురం సర్పంచ్, ఆదిమూర్తి పల్లె మాజీ సర్పంచ్ చెన్నబోయిన అరుణకుమారి,చెన్నబోయిన రామకృష్ణ,కుసుమ మహానంది యాదవ్,మందగిరి రంగస్వామి గడికోట మాజీ సర్పంచ్,పాలూరి వెంకటేశ్వర్లు సంజీరావుపేట ఉపసర్పంచ్,మోడీ రంగస్వామి జయరాంపురం ఉపసర్పంచ్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి వారికీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోవు ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలోని అన్నీ వర్గాల ప్రజలు తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారుIMG-20230924-WA0304 IMG-20230924-WA0303

Views: 8
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News