సంక్షేమ రథ సారథి జగన్ మోహన్ రెడ్డి: బాచిన కృష్ణ చైతన్య
న్యూస్ ఇండియా అద్దంకి
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రథసారధిగా నిలిచారని, నవరత్నాలు ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అద్దంకి వైసీపీ ఇంఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు.
అద్దంకి మండలం ,మనికేశ్వరం గ్రామంలో 2వ రోజు గడప గడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్,ఎంపీపీ,జెడ్పీ టి సి,మండల కన్వీనర్,అధికారులు,సచివాలయం కన్వీనర్,గృహ సారథులు , సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List