OU Congress Vs TRS: ఉస్మానియాలో రాహుల్‌ గాంధీ పర్యటన

On

OU Congress Vs TRS: ఉస్మానియాలో రాహుల్‌ గాంధీ పర్యటనకు ముందే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూనివర్సిటీలో రాహుల్‌ పర్యటనను ఆపడం ఎవరి తరమూ కాదని కాంగ్రెస్‌ చెబుతుంటే.. ఎలాగైనా రాహుల్‌ రాకను అడ్డుకుంటామంటోంది టీఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగం. ఓయూలో రాహుల్‌ గాంధీకి అనుమతి నిరాకరించడంపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అనుమతి కోసం ఇవాళ మరోసారి ఓయూకి వెళ్తున్నారు రేవంత్‌రెడ్డి. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఓయూకు వస్తుంటే… రాష్ట్ర […]

OU Congress Vs TRS: ఉస్మానియాలో రాహుల్‌ గాంధీ పర్యటనకు ముందే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూనివర్సిటీలో రాహుల్‌ పర్యటనను ఆపడం ఎవరి తరమూ కాదని కాంగ్రెస్‌ చెబుతుంటే.. ఎలాగైనా రాహుల్‌ రాకను అడ్డుకుంటామంటోంది టీఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగం.

ఓయూలో రాహుల్‌ గాంధీకి అనుమతి నిరాకరించడంపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అనుమతి కోసం ఇవాళ మరోసారి ఓయూకి వెళ్తున్నారు రేవంత్‌రెడ్డి. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఓయూకు వస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వదని మండిపడ్డారు. టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలను వీసీ కాపాడుతున్నారని ఆరోపించారు. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు వీసీతో మాట్లాడి పర్మిషన్ ఇవ్వాలని అడిగితే.. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు.

చంచల్‌గూడ జైలులోని ఎన్ఎస్యూఐ విద్యార్ధి నాయకులను కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజనీకుమార్ యాదవ్, సంపత్ కుమార్‌తో కలిసి వెళ్లి పరామర్శించారు రేవంత్‌రెడ్డి. ఈ నెల 7న జైల్లో ఉన్న తమ విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్ శివకుమార్ గౌడ్‌ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*