పాయకరావుపేటలో ఎవరు?
ఎమ్మెల్యేల్ని మార్చే వ్యూహంలో జగన్

వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చకపోతే వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉండటంతో.. 40 నుంచి యాభై 50 మంది ఎమ్మెల్యేల్ని మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
స్థానికంగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చకపోవడంతోనే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. దీంతో మొట్ట మొదట పడే వికెట్ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుదే. ఆయనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటం.. పార్టీ కేడర్ కూడా ఆయనకు సహకరించకపోవడంతో ఆయన్ను మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. గొల్ల బాబూరావు ప్లేస్ లో ఆ టికెట్.. క్లీన్ ఇమేజ్ ఉన్న ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అమ్మాజీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమ్మాజీ అయితే విజయం చాలా సులువు అవుతుందనే ధీమాలో వైసీపీ హైకమాండ్ ఉంది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List