పొంగులేటి పై ఈడి దాడులు బిజెపి బిఆర్ఎస్ లోపాయి కార ఒప్పందమే

ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరు

On

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

IMG20240928163259కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) సెప్టెంబర్ 28: ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ లోని వారి  నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై బిజెపి బిఆర్ఎస్ లోపాయి కారి ఒప్పందముతో జరిగిన ఈడి దాడులు రాజకీయ కక్ష సాధింపు అని అన్నారు. మంచి రాజకీయ భవిష్యత్తు , ప్రజల నాయకుడైన పొంగులేటి ఆదరణను ఓర్వలేకనే ఈడి దాడులు జరుగుతున్నాయి అన్నారు. పొంగులేటి కుమారుడు మరియు బంధువుల ఇండ్లపై 16 చోట్ల ఏకకాలంలో దాడు జరిపారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందని, రాబోయే రోజుల్లో కచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చంద్రశేఖర రావు , కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, కూచిపూడి జగన్, మాలోత్ కృష్ణ, అర్జున్ రావు, వెంకటరెడ్డి, ధర్మారావు, బలరాం, అరుణ్, పూణెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

.

 

Views: 508
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!