ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఫస్ట్ బర్త్ డే....

- సీఎం రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శం.. -

On
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఫస్ట్ బర్త్ డే....

*జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ శ్రేణులు...*

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 08 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా డీసీపీ అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, బచ్చన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి తోలిసారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.అంచెలంచెలుగా ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శమన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారని ,పొలిటికల్ కెరీర్లో ఎన్నో సవాళ్లు, కేసులు ఎదురైన భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారని,జైలు జీవితం కూడా గడిపిన ,అయినప్పటికీ చెక్కు చెదరని మనో ధైర్యంతో ప్రత్యర్థులను మట్టికరిపించి ఏకంగా రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారని ,డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అని తెలిపారు. రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత సొంతం చేసుకున్నారని వివరించారు.ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అరటి పండ్లు పంపిణీ చేశారు.రెవెన్యూ కార్యాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు,పలు  గ్రామాల అధ్యక్షులు,బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, యూత్ కాంగ్రెస్,మహిళా విభాగం, కిసాన్ సెల్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్,తాజా మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.8e2aad105687474a87123e4130b23412IMG-20241108-WA2125

Views: 202
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి