విశ్వహిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు

On
విశ్వహిందూ  మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో) నవంబర్ 21:విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని లక్ష్యా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలని సభ నిర్వహించినట్లుగా విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు తెలిపారు.ఈ సభకు విశ్వహిందూ మహాసంఘ్ పీఠం నుండి గురువులు బల్దేవ్ సింగ్ ఠాకూర్, జాతీయ ఉపాధ్యాక్షురాలు లక్ష్మి ఠాకూర్,మహావీర్ కొరవి,అదే విధంగా కొన్ని రాష్ట్రాల నుండి పీఠాధిపతులు హాజరు కానున్నారు ఆని,కేవలం ఈ సభలో పూజారులకి సంబంధించిన హక్కులు, మౌలిక సదుపాయాలు మరియు వారి సమస్యల మీద సభ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.ఈ సభకు సుమారు 2,000. మంది పూజారులు హాజరు కానున్నారని. శాంతియుతంగా జరిగే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పైదా సోము, కుంజా నాగేంద్రబాబు,సిసింద్రీ,వీర్రాజు,వెంకటేష్,పైదా ప్రసాద్,రాజులపాటి ఐలయ్య, ముక్తి మల్లేష్,బొర్రా నాగమణి,కుంజా భవాని,వాసం రాణి, వట్టం వినోద, ఎండీ రంజాన్, సయ్యద్ ఖమ్రుద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక