తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:
తొర్రూరు సెంటర్:
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వ్యాపారంలో ఆవిష్కరణ మరియు స్థిరత్వం: వికసిత్ భారత్ @ 2047 కోసం మల్టీడిసిప్లినరీ రోడ్మ్యాప్" అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది.
*ముఖ్య అతిథులుగా ప్రముఖులు*
ఈ కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశస్వినిరెడ్డి మామిడాల ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించనున్నారు. విశిష్ట అతిథిగా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి హాజరవుతారు.
ప్రధాన ప్రసంగం (Keynote Address)
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం డీన్ ప్రొఫెసర్ రాజేందర్ కట్ల ముఖ్య వక్తగా విచ్చేసి, కృత్రిమ మేధ (AI) భవిష్యత్తులో వ్యాపార రంగంలో తీసుకురాబోయే విప్లవాత్మక మార్పుల గురించి కీలక ప్రసంగం చేయనున్నారు.
నిర్వహణ బృందం
సెమినార్ డైరెక్టర్: డాక్టర్ బి. రాములు (ప్రిన్సిపాల్, GDC తొర్రూర్)
కో-డైరెక్టర్: డాక్టర్ జి. సుజాత (వాణిజ్య విభాగాధిపతి)
కన్వీనర్ & ఆర్గనైజింగ్ సెక్రటరీ: డాక్టర్ ఆర్. సునీల్ (అసిస్టెంట్ ప్రొఫెసర్)
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బానోత్ రెడ్డి, కళాశాల IQAC కోఆర్డినేటర్ వై. రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొంటారు.
"భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సాంకేతికత మరియు వ్యాపార ఆవిష్కరణల పాత్రపై ఈ సెమినార్ దిశానిర్దేశం చేయనుంది." అని నిర్వాహకులు తెలిపారు.

Comment List