సచివాలయ ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు

బందెల దొడ్డి బజార్,క్లబ్ రోడ్డు సచివాలయ ఉద్యోగస్తులకు మెమోలు జారీ

On
సచివాలయ ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు

గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో బందెల దొడ్డి బజార్ .,క్లబ్ రోడ్డు సచివాలయాలు యందు విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది మధ్యాహ్న సమయంలో తరచుగా సచివాలయం తాళాలు వేస్తున్నందున పలు అవసరాల నిమిత్తం సచివాలయం కు వచ్చే ప్రజలు అసౌకర్యంగా వెను తిరిగి వెళుతున్నారని ఈ విషయంపై ప్రజలు నగర పంచాయతీ కార్యాలయంకు ఫిర్యాదు చేయగా గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వై రామకృష్ణయ్య వెంటనే స్పందించి విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న బందెల దొడ్డి బజార్,క్లబ్ రోడ్డు సచివాలయ ఉద్యోగస్తులకు మెమోలు జారీ చేశారు.ఈ సంధర్బంగా వై రామకృష్ణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందని కావున నగర పంచాయతీ పరిధిలో ప్రతి ఒక్క వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా సమయానికి విధులకు హాజరు కావాలని అలాగే సచివాలయ పని దినంలో ఫీల్డ్ వెరిఫికేషన్ కు వెళ్లే సమయంలో ఖచ్చితంగా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగస్తులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఈ విధంగా మరలా పునర్రావృతమైతే సిసిఎ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుందని తెలియజేసారు..

IMG-20230927-WA0275
నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణయ్య..
Views: 227
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌...
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారజోరు పెంచిన సిపిఐ
ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత