ర్యాకల్ పాఠశాలలో గ్రంథాలయ ఏర్పాటు 

సర్వోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

On
ర్యాకల్ పాఠశాలలో గ్రంథాలయ ఏర్పాటు 

సర్వోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాకల్ ఉన్నత పాఠశాల ఆదివారం గ్రంథాలయ ప్రారంభోత్సవం చేసిన గౌరవనీయులు Dr. సుధాకర్ నాయక్ IMG-20231001-WA0070ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే ర్యాకల పాఠశాల గత ఏడాది నుండి చంద్రశేఖర్ ఆచార్య కృషితో రాత్రివేళ సముదాయాల వారీగా  చదువులు, ప్రతినిత్యం ఉదయం ఎనిమిది గంటలకే పాఠశాలకు విద్యార్థులు రావడం  అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఇలా   ప్రత్యేక గుర్తింపు పొందడం తనని ఎంతో ఆకట్టుకున్నదని, వారు అడగడంతోనే గ్రంథాలయంను సర్వోదయ ఫౌండేషన్ ఏర్పాటుకి కృషి చేసిందనారు. ఇప్పటి వరకు 25 గ్రంథాలయాలు ప్రారంభించామన్నారు. డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఎన్సిసి మాదిరిగానే విద్యార్థులు డ్రెస్ కొడ్ తో గౌరవ వందనం ఇవ్వండం, క్రమశిక్షణతో విద్యార్థులు చదవడం, ఇంత మంచి ఉపాధ్యాయులు ఉండడం గొప్ప వరం అన్నారు. అదేవిదంగా పాఠశాల విద్యార్థులకు  క్రీడా సామాగ్రి కోసం లక్ష రూపాయలు ప్రకటించిన  ( ENT స్పెషలిస్ట్ )  డాక్టర్ సురేష్ గారు మరియు మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా పాఠశాల మైదానంతా సరిపోయే గ్రీన్ మ్యాట్  ను అందచేయనున్నట్లు   గౌరవనీయులు కళాశాల ప్రాచార్యులు  కళింగ కృష్ణ కుమార్ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్ , సర్పంచ్ సుజాత గుండ్రెడ్డి, మాజీ సర్పంచులు రాజు పటేల్,అంజయ్య, సర్వోదయ ఫౌండేషన్ రాజేష్ సక్సేన,వైద్యులు ఉపేందర్,సురేష్, ప్రధానోపాధ్యాయులు గోపాల్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, నర్సింలు,దత్తు,హనుమాన్లు, లక్ష్మణ్,పాండు, భూమయ్యలు పాల్గొన్నారు.

Views: 69
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం