ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనీరతి: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జ‌గ‌న్‌

By Teja
On
ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనీరతి: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జ‌గ‌న్‌

సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన ‍యోధుడు పోలీస్ అని సీఎం జగన్ కొనియాడారు. ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనీరతి అని, పోలీస్‌ ఉద్యోగం అనేది ఓ సవాల్‌.. బాధ్యత అని అలాంటి పోలీస్‌ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ సిబ్బందికి నివాళులర్పించారు.

పోలీసు అమరులను స్మరించుకునే రోజు

ఈ రోజు విధినిర్వహణలో అమరులైన పోలీసు త్యాగాలను స్మరించుకునే రోజు అని, దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్‌ చేసే కమామ్‌రేషన్‌ డే సందWhatsApp Image 2023-10-21 at 10.26.41 AMర్భంగా మనం ఇక్కడ సమావేశమైయ్యామని పోలీసులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 21 వ తారీఖున పోలీసుల అమరవీరుల సంస్మరణదినోత్సవం దేశమంతా జరుపుకుంటుందని చెప్పారు

1959 అక్టోబరు 21 న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్‌ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఆమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాం అని అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో ఇలా దేశ వ్యాప్తంగా అమరులైన 188 పోలీసులు అందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. 

పోలీసులకు ప్రభుత్వం అన్నిరకాలుగా తోడుగా ఉంటుంది

Read More రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..

ఈ ఏడాది మన రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణం ఒదిలిన పోలీసు సోదరుల కుటుంబాలకు మనందరి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా, తోడుగా ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీసు అని, ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగ నిరతి అని, ఆ డ్రెస్‌ మీద ఉన్న మూడు సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం అని అన్నారు. పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదని, అంతకుమించి పోలీస్‌ అంటే ఒక బాధ్యత కూడా అని ఈ ఉద్యోగం ఒక సవాల్‌ అని మరీ ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు విలువ ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి

ఈ రోజు కొత్త టెక్నాలజీ వల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సైబర్‌ సెక్యూరిటీ నుంచి డేటా థెప్ట్‌ వరకు, డేటా థెప్ట్‌ నుంచి సైబర్‌ హెరాస్‌మెంట్‌ వరకు ప్రతి అంశంలోనూ నేరాలన్నీ నిరోధించడానికి, వాటి మీద దర్యాప్తు చేసి శిక్షవేయడానికి పోలీసులు ఎంతగానో అప్‌డేట్‌ కావాల్సిన యుగంలో మనమంతా ఉన్నామని, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వాడకం వల్ల సైబర్‌ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకుని నేరాలు చేస్తున్నవాళ్లను ఎదుర్కొవాల్సిన ఒక బృహత్తర బాధ్యత కూడా ఇవాళ పోలీసుల భుజస్కంధాల మీద మరింతగా వచ్చిపడిందని సీఎం పేర్కొన్నారు. రకరకాల నేరాలతో పాటు కొత్త టెక్నాలజీని అనూహ్యంగా వాడుకుని విజృంభించే అసాంఘిక శక్తులు విసిరే సవాళ్లకు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ మారుతున్న ఈ సమాజం విసురుతూ ఉన్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి మనందరి సిద్ధం కావాలని సూచించారు. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోనూ మన పోలీసులు అత్యాధునిక సైబర్‌ టెక్నాలజీ ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారన్న వాస్తవం, ఈ డివిజన్‌లో 130 మంది సాంకేతిక పోలీసింగ్‌ నిపుణులను మన ప్రజల కోసం పనిచేస్తున్న వాస్తవం ప్రజలకు ఎంతో ధైర్యానిస్తుందని చెప్పారు.

అసాంఘిక శక్తులను రీడిఫైన్‌ చేయాల్సిన సమయం 

ఇదే సమయంలో అసాంఘిక శక్తులనే పదాన్ని మనం రీడిఫైన్‌ చేయాల్సిన అవసరం ఇటీవల జరిగిన అనేక సంఘటనలు చూసినప్పుడు మనందరికి కూడా ఇది  ప్రస్ఫుటంగా కనిపిస్తుందని సీఎం జగన్ అన్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజాజీవనాన్ని తమ స్వార్ధం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులేనని, ప్రభుత్వం మీద, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలనుకునే ఇలాంటి శక్తులన్నీ కూడా అడవుల్లోనో, అజ్ఞాతంలో కాకుండా ప్రజా జీవితంలో ఉంటూ అదే ప్రజాజీవితం మీద దాడిచేయడాన్ని కూడా మనమంతా ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైన పరిస్థితులను చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పత్రికాస్వేచ్ఛ లాంటి పదాలకు అర్ధం అంటే ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని పోలీసుల నుంచి న్యాయస్ధానాల నుంచి లాగేసుకోవటం కాదని గుర్తు చేశారు. మొన్న నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్‌ను చంపారుని మన కళ్లెదుటనే జరిగిన సంఘటనలు ఇవన్నీ అని సీఎం ఉదాహరణలు చెప్పారు.

ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించింది

"అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడు తన పార్టీవాళ్లను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడం, ఆ తర్వాత పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాలే చివరకి ఒక పోలీసు సోదరుడి కన్ను పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ, అవినీతి, నేరాలు చేస్తే ఆ పైన ఆధారాలు అన్ని చూసిన పిమ్మట న్యాయస్ధానాలన్నీ వీరికి అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి.. చివరకి ఆ న్యాయమూర్తుల మీద ట్రోలింగ్‌ చేస్తారు. వారికి సంబంధించిన టీవీ ఛానెళ్లలో డిబెట్లు నడుపుతారు. తమను ఎవరూ కూడా ఏం చేయలేరన్న అహంకారంలో ఇవన్నీ చేస్తుంటారు. ఇటువంటివి అన్నీ యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ చేసే పనులే తప్ప.. ప్రజాస్వామ్యం మీద కానీ, రూల్‌ ఆఫ్‌ లా మీద కానీ నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావు" అని సీఎం జగన్ పేర్కొన్నారు

దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదు

తమ స్వార్ధం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్‌రెస్ట్‌ క్రియటే చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టానికి పని పెట్టండని, ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద దాడి చేసే ఇటువంటి దుష్టశక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుందన్నది కూడా మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

మన ప్రభుత్వం– పోలీసు సంక్షేమం

"ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంక్షేమం గురించి ఏ రకంగా అడుగులు వేశామన్నది నాలుగు మాటల్లో చెబుతాను.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 16వేల మంది మహిళా పోలీసులను ఈ నాలుగేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో మనందరి ప్రభుత్వం నియమించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ తీసుకునివచ్చాం. దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లాలో దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించడం ఇలా అక్కచెల్లెమ్మల మీద వారి భద్రత మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఈ నాలుగేళ్లలో మనందరి ప్రభుత్వంలో మన పోలీసు సోదరులు చేస్తున్నారు" అని సీఎం జగన్ వివరించారు

Views: 11

About The Author

Post Comment

Comment List

Latest News