నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం.
నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు
On
న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 6 (నల్లగొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డు ఇరువైపుల ఉన్న పలు వ్యాపారవేత్తలను కలిసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రానున్నది కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సకినాల రవి,కౌన్సిలర్ యాసారపు వెంకన్న,లింగాల వెంకన్న బోప్పని యాదగిరి, గుణ గంటి రాజు,మార్షల్ రమేష్, వెంకట సుబ్బయ్య,రాజు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 14
About The Author
Related Posts
Post Comment
Latest News
01 May 2026 09:16:31
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి:...

Comment List