దీపావళి పండుగ 

దీపం ఐశ్వర్యం

On
దీపావళి పండుగ 

దీపావళి పండుగ 
దీపం ఐశ్వర్యం అని.. అంధకారం దరిద్రం అని.. దీపమున్నచోట జ్ఞాన సంపద ఉంటుందని దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీపావళిరోజు లక్ష్మీ దేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే.. సకల సంపదలు కలుగుతాయని పురాణాలు తెలిపాయి. సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సంప్రదాయం. దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులగా చెప్తుంది శాస్త్రము.

దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా.. నీలకాంతి విష్ణు భగవానునిగా.. తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెపుతారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రము రోజును దీపావళిగా చెప్తారు. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

శ్రీరామ చంద్రుడు.. సీతా దేవి
రావణాసురునితో జరిగిన యుద్ధంలో విజయము సాధించిన శ్రీరామచంద్రుడు.. సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆరోజు ఆశ్వయుజ మాసం, అమావాస్య అని రామాయణం చెప్తుంది. ఆరోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి.

నరకాసురుని సంహరణ
నరకాసురుని సంహరించిన తరువాత.. నరకాసురుని పీడ వదిలిపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఆ పరంపర నేటికి జరుగుతున్నదని పురాణాలు చెప్తున్నాయి.

Read More సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.


లక్ష్మీదేవి ఉద్భవించినరోజు..
దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రమును చిలుకుతుండగా.. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆరోజును దీపావళిగా చెప్తారు. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని.. దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు.

Read More వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.

అజ్ఞాతవాసం తర్వాత
మహాభారతంలో కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు. అలా పాండవులు తిరిగివచ్చిన రోజున దీపావళి పండుగగా చేస్తారు

Read More ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!

అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

గుండెపుడి చైతన్య శర్మ 
ఫోన్ నెంబర్ 960 387 1143

Views: 119
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.