కారు గుర్తుకు ఓటే వెయ్యాలే.... కేసీయారే. మళ్లీ రావాలే....

దళితులందరికీ దళిత బందు ఇప్పిస్తాం: ఫైళ్ళ శేఖర్ రెడ్డి

On
కారు గుర్తుకు ఓటే వెయ్యాలే.... కేసీయారే.  మళ్లీ రావాలే....

IMG_20231113_095351
ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఫైళ్ళ శేఖర్ రెడ్డి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వలిగొండ మండలంలోని లోతుకుంట, నరసయ్య గూడెం, అరూర్, గుర్నాథ్ పల్లి, వెంకటాపూర్ గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆరూర్ గ్రామంలో రోడ్ షోలో మాట్లాడుతూ దళితులందరికి దళిత బందు ఇవ్వడం మా బాధ్యత అని అన్నారు.ఈ సందర్భంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కెసిఆర్ చేసిన సంక్షేమ పథకాలన్నీ పెద్ద ప్రజల అభివృద్ధి కోసమే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరింత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీ జె పి లు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు శేఖర్ రెడ్డి కి స్వాగతం పలికారు. ప్రతి గ్రామం లో గులాబీ దండు తో పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 394

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్