ఘనంగా ప్రారంభమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచార యాత్ర..

బతుకమ్మలు,కోలాటాలు,పూలతో ,హారతులతో ఘనస్వాగతం పలికిన రామచంద్రాపురం గ్రామ వాసులు

On
ఘనంగా ప్రారంభమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచార యాత్ర..

ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా,
ధేవురుప్పుల మండలం,
పాలకుర్తి నియోజకవర్గం:

దేవురుప్పుల మండలం రామచంద్రాపురం లో ఘనంగా ప్రారంభమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచార యాత్ర..
బతుకమ్మలు,కోలాటాలు,పూలతో ,హారతులతో ఘనస్వాగతం పలికిన రామచంద్రాపురం గ్రామ వాసులు,సరదాగా వారితో కలిసి నాట్యం చేసి,గ్రామ దేవతలను దర్శించుకున్న దయాకర్ రావు..

#అలరించిన జానపద గాయని కనకవ్వ,రెలారే గంగ ల పాటలు ,వాటికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ స్వాగతం పలికిన గ్రామ ప్రజలు..

#గ్రామ సర్పంచ్  నాగంపల్లి బక్కమ్మ మాట్లాడుతూ ఈ గ్రామం దయన్న నాయకత్వం లో అన్ని విధాలా అభివృధి చెందింది మళ్ళీ అదే విధంగా ఓటు వేసి గెలిపించి విజయోత్సవ సభ కూడా ఇక్కన్నుంచే చేయాలి..

Read More మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

#దయన్న గురించి మనకు బాగా తెలుసు.. డబ్బు కట్టలతోటి  వచ్చిన కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్ రాకుండా అమెరికా తరిమి వేయాలి..

*ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ....

#నాకు ఘన స్వాగతం చెప్పిన అక్క చెల్లెమ్మలు,యువకులు,వృద్దులకు ధన్యవాదాలు

#ఓటు వేసే ముందు మన భవిష్యత్ గురించి ఆలోచించాలి..
#60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ,10 ఏళ్ల బీ ఆర్ ఎస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి..

#కొత్తగా వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి మన కష్టకాలం లో ఎప్పుడైనా కనపడిందా..?మన బ్రతుకు తెరువు తెలుసా..నేను మొదట్లో ఇక్కడకు వచ్చినప్పుడు ఈ గ్రామం గుంతలమాయమైన రోడ్లతో ,ఎండిపోయిన పొలాల తో కనపడేవి..

#కానీ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  గ్రామానికి నాణ్యమైన రోడ్లు,కరెంట్,పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయి..

*ఇంకా చేయబోయే అభివృద్ధి పథకాల గురించి చెపుతూ..
వృద్దుల  పెన్షన్ 5వేలకు,రైతు బంధు 16 వేలకు పెంచుతామని అలాగే కూలీ పనులకు వెళ్లేవారికి నెలకు 3 వేల బృతి,5 లక్షల భీమా కూడా చేస్తామని,ఇల్లు లేని వారి అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళ స్థానే,సొంతంగా ఇల్లు కట్టుకున్న వారికి 5 లక్ష రూపాయలు మంజూరు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు...IMG-20231116-WA0394

Views: 39
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం