ఘనంగా ప్రారంభమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచార యాత్ర..

బతుకమ్మలు,కోలాటాలు,పూలతో ,హారతులతో ఘనస్వాగతం పలికిన రామచంద్రాపురం గ్రామ వాసులు

By Venkat
On
ఘనంగా ప్రారంభమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచార యాత్ర..

ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా,
ధేవురుప్పుల మండలం,
పాలకుర్తి నియోజకవర్గం:

దేవురుప్పుల మండలం రామచంద్రాపురం లో ఘనంగా ప్రారంభమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచార యాత్ర..
బతుకమ్మలు,కోలాటాలు,పూలతో ,హారతులతో ఘనస్వాగతం పలికిన రామచంద్రాపురం గ్రామ వాసులు,సరదాగా వారితో కలిసి నాట్యం చేసి,గ్రామ దేవతలను దర్శించుకున్న దయాకర్ రావు..

#అలరించిన జానపద గాయని కనకవ్వ,రెలారే గంగ ల పాటలు ,వాటికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ స్వాగతం పలికిన గ్రామ ప్రజలు..

#గ్రామ సర్పంచ్  నాగంపల్లి బక్కమ్మ మాట్లాడుతూ ఈ గ్రామం దయన్న నాయకత్వం లో అన్ని విధాలా అభివృధి చెందింది మళ్ళీ అదే విధంగా ఓటు వేసి గెలిపించి విజయోత్సవ సభ కూడా ఇక్కన్నుంచే చేయాలి..

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

#దయన్న గురించి మనకు బాగా తెలుసు.. డబ్బు కట్టలతోటి  వచ్చిన కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్ రాకుండా అమెరికా తరిమి వేయాలి..

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

*ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ....

#నాకు ఘన స్వాగతం చెప్పిన అక్క చెల్లెమ్మలు,యువకులు,వృద్దులకు ధన్యవాదాలు

#ఓటు వేసే ముందు మన భవిష్యత్ గురించి ఆలోచించాలి..
#60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ,10 ఏళ్ల బీ ఆర్ ఎస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి..

#కొత్తగా వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి మన కష్టకాలం లో ఎప్పుడైనా కనపడిందా..?మన బ్రతుకు తెరువు తెలుసా..నేను మొదట్లో ఇక్కడకు వచ్చినప్పుడు ఈ గ్రామం గుంతలమాయమైన రోడ్లతో ,ఎండిపోయిన పొలాల తో కనపడేవి..

#కానీ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  గ్రామానికి నాణ్యమైన రోడ్లు,కరెంట్,పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయి..

*ఇంకా చేయబోయే అభివృద్ధి పథకాల గురించి చెపుతూ..
వృద్దుల  పెన్షన్ 5వేలకు,రైతు బంధు 16 వేలకు పెంచుతామని అలాగే కూలీ పనులకు వెళ్లేవారికి నెలకు 3 వేల బృతి,5 లక్షల భీమా కూడా చేస్తామని,ఇల్లు లేని వారి అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళ స్థానే,సొంతంగా ఇల్లు కట్టుకున్న వారికి 5 లక్ష రూపాయలు మంజూరు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు...IMG-20231116-WA0394

Views: 33
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు