BSP పార్టీ లోకి పెరుగుతున్న చేరికలు

పటాన్చెరు నియోజకవర్గం

By Ramesh
On
BSP పార్టీ లోకి పెరుగుతున్న చేరికలు

పటాన్చెరు నియోజకవర్గంలో BSP అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో  BRS శ్రేణులు BSP లోకి చేరారు.

BRS పార్టీ కి చెందిన కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ దొంతి రాములు కుమారుడు దొంతి పెంటేష్ మరియు కార్యకర్తలకు నీలం మధు ముదిరాజ్ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. BSP పటాన్చెరు MLA అభ్యర్థి నీళం మధు ముదిరాజ్  మాట్లాడుతు ప్రజలకు కావలిసింది డబ్బులు, స్కీములు కావని, ప్రజలకు కావలసినవి ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అన్నారు. BSP పార్టీని మనం గెలిపించుకుంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం సాధ్యం అని అన్నారు. మరియు BSP గెలిస్తే ప్రజలు అందరు గెలిచినట్టే అని అన్నారు.

ఈ సందర్భంగా దొంతి పెంటేష్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం లో నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయం అని , BSP అధికారం లోకి వస్తుంది కాబట్టి ప్రజలంతా నీలం మధు ముదిరాజ్ ఏనుగు గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీ తో నీళం మధు ముదిరాజ్ ని గెలిపించాలని కోరారు.

చేరిన వారిలో భాస్కర్,శ్రీకాంత్,పవన్, నర్సింగ్,సాయి,రాజు, శివ ప్రవీణ్,సుధాకర్,సూరి, సాయి రామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231121-WA0031

Read More ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu

Views: 241
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం