ఆడుదాం ఆంధ్ర కిట్లుపంపిణీ :ఎంపీపీ,జడ్పిటిసి,ఈఓఆర్టి

By Khasim
On
ఆడుదాం ఆంధ్ర కిట్లుపంపిణీ :ఎంపీపీ,జడ్పిటిసి,ఈఓఆర్టి

యర్రగొండపాలెం మండలంలోని అన్ని పంచాయతీలకు  శుక్రవారం ఆడుదాం ఆంధ్రా కిట్లను ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, జడ్పిటిసి చేదురి విజయభాస్కర్, ఈఓఆర్టి రాజశేఖర్ రెడ్డి, కన్వీనర్ ఓబుల్ రెడ్డిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ క్రీడల్లో పురుషులు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర  కార్యక్రమం క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన మెగా క్రీడోత్సవం ఆడుదాం ఆంధ్రలో క్రీడాభిమానులు తమ సత్తా చూపాలన్నారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అందుబాటులో ఉన్న మైదానాలను ఎంపిక చేసి క్రీడలు నిర్వహించేం దుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాలు, వార్డుల నుంచి క్రీడాకారులు క్రీడోత్సవాలలో పాల్గొనేం దుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలి ఐదు రోజులు గ్రామ స్థాయిలో, 12 రోజులు మండల స్థాయి లో, తర్వాత ఐదు రోజులు నియోజకవర్గ స్థాయిలో,ఏడు రోజులు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నా రు. క్రికెట్కు 16 మంది, బ్యాడ్మింటన్కు ఇద్దరు, కబడ్డీకి 12 మంది, వాలీబాలు 12 మంది, ఖోఖో జట్టుకు 15 మంది క్రీడాకారులు ఉండాలన్నారు. క్రీడల నిర్వహణకు అవసరమైన కిట్లు, ఇతర క్రీడా సామాగ్రిని ఇస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని సచివాలయాల సెక్రట రీలకు కిట్లు, క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యాలయంలో ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్, సర్పంచ్ అరుణ బాయి, కన్వీనర్ సయ్యద్ జబీవుల, కో ఆప్షన్ నెంబర్ షాబీర్ భాష, ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మూడమంచు బాల గురవయ్య, నర్రెడ్డి వెంకటరెడ్డి, మైనార్టీ నాయకులు వలి, అచ్చయ్య, చెన్నకేశవులు,పంచాయతీల కార్యదర్శులు రామసుబ్బయ్య,రామారావు నాయక్, శివలింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.IMG-20231208-WA0562(4)

Views: 66
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక