నవతరానికి మార్గదర్శి.. బంగారు తెలంగాణ...దిక్సూచి కేటీఆర్: బండారి
బండారి ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో నరేష్):కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వనమా ఆదేశాల మేరకు 35 వార్డులో బండారి యువత ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు బండారి యువత ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ తెలంగాణ జాతి చైతన్యానికి చేతనకు నిలువెత్తు ప్రతీక కేటీఆర్ అని తెలిపారు.60 ఏండ్ల కలను సకారం చేయడంలో తనదైన పాత్ర పోషించి నిలిపేందుకు ఐటి పరిశీల మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయా రంగాల సమ్మిళితమై పురోగతిలో ఆయన చేసిన ఆవిరాల కృషి మర్చిపోలేనిదని తెలిపారు.కాంగ్రెస్ ఆ సమర్థ పాలను చూశాక రాష్ట్రంలో గుర్రాలు ఎవరో గాడిదలు ఎవరు ప్రజలకు తెలిసిపోయిందని తెలిపారు.ఆరు గారెంటీల పేరిట అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ అని వర్గాల ప్రజలు మోసం చేసింది అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 20 నెలలైనా రుణమాఫీ లేదు రైతు భరోసా పడతలేదు తులం బంగారం ఇస్తలేరు మహాలక్ష్మి పథకం లో బాగా 2500 కూడా ఇవ్వడం లేదు అడ్డగోలు హామీలతో ప్రజల్ని మభ్యపెట్టారు.ఈ కార్యక్రమంలో తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు న్యాయవాది శాంతిరాం మరియు బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పంది రాజు ఖాళీ పటాన్, మనోజ్, ఓం ప్రకాష్ పండిట్, మణికంఠ, భాలి ప్రవీణ్, పూర్ణ,జీ.మోహన్,నరసింహ, రమణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comment List