రేషన్ కార్డ్ పంపిణీలో కాంగ్రెస్ నాయకుల ఆవేదన 

సిపిఐ కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం

On
రేషన్ కార్డ్ పంపిణీలో కాంగ్రెస్ నాయకుల ఆవేదన 

మీడియాకు కాంగ్రెస్ నాయకుల ఆవేదన చెప్తుండగా అడుకున్న సిపిఐ నాయకులు

కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో ): కొత్తగూడెం క్లబ్బులో శుక్రవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని రేషన్ కార్డుల పంపిణీ నిర్వహిస్తుండగా, సౌత్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులువేదిక మీదికి వెళ్ళగా ఎమ్మెల్యే వారిని కిందికి వెళ్ళమన్నారని, అసహనం వ్యక్తం చేశారు. దాంతో వారు మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తం చేస్తుండగా సిపిఐ నాయకులు వారిని వారించే ప్రయత్నం చేయగా, ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం నెలకొంది. దాంతో పోలీసులు గొడవను సద్దుమణిగించారు. 

Views: 234
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News