వరుస రోడ్డు ప్రమాదాలతో వణికిపోతున్న ప్రజలు

On
వరుస రోడ్డు ప్రమాదాలతో వణికిపోతున్న ప్రజలు

మార్కాపురం డివిజన్/న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి.ప్రమాదానికి కారణం ఏమిటి ఎవరు అనేది పక్కన పెడితే ప్రతి చిన్న ప్రమాదంలో ను ప్రాణ హాని తప్పటం లేదు.డిసెంబర్ మాసం సగం నుండి నేటి వరకు ఎదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదపు వార్తలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోమరోలు, గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, జగంగుంట్ల, సోమవారిపేట ఇలా వేరు వేరు ప్రాంతాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగాయి.అయితే ప్రతి ప్రమాదంలోనూ ప్రాణ నష్టం జరిగిన విషయం డివిజన్ లోని ప్రజలను కలచివేస్తుంది.జరిగిన అన్ని రోడ్డు ప్రమాదాలూ కారు, ద్విచక్రవాహనాలకు మాత్రమే ఎక్కువ మొత్తంలో జరిగాయి.దీంతో ప్రజలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయుటకు భయపడుతున్నారు.మరి కొందరైతే ఈ నూతన సంవత్సరం సరిగా లేదని, అరిష్టం అని మూఢనమ్మకాలను బలంగా నమ్ముతున్నారు.ఎదేమైనప్పటికి వరుస రోడ్డు ప్రమాదాలను అరికట్టుటకు ప్రభుత్వ నియమ,నిబంధనలను అనుసరించి ప్రయాణం చేయుట.. ఒక మంచి అవకాశం అని, అలానే డ్రైవింగ్ సరిగా రాని వారు ప్రధాన రహదారులపై కి రావటం నిలిపివేయాలి అనేది, అతి వేగం తగ్గించాలి అనేది ప్రజలు తెలుసుకోవటం చాలా అవసరం.images (1)

Views: 173

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.