రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు
పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై
By JHARAPPA
On
రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు శనివారం రోజు నిర్వహించారు.ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పాల్గొని పాయసం వండారు. అనంతరం దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు.శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదు చ్చరి రాజ్నివాస్లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.
Views: 109
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Dec 2025 22:38:06
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...

Comment List