కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలి

On
కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలి

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి లో ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కు వినతిపత్రం ఇచ్చారు.  IMG-20240129-WA0072ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండల కేంద్రమైన కంగ్టి గ్రామానికి ఎస్సి రిజర్వేషన్ కేటాయించాలని అన్నారు.కంగ్టి గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నుండి ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి ఎస్సి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించకపోవడం విచారకరమని అన్నారు.గ్రామంలో 2996 ఓటర్లు ఉన్నారని అందులో మెజారిటీ జనాభా 650 కి పైచిలుకు ఎస్సీల ఓట్లు ఉంటాయని అన్నారు. కావున దయచేసి వచ్చే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని అలాగే అవసరమైనన్ని వార్డు మెంబర్లకు కూడా జనాభా ప్రతిపదికన వార్డు మెంబర్ల సంఖ్య పెంచి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు.ఇప్పటికైనా నాయకులు అధికారులు చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ యూత్ అరుణ్, రాజు, సీమోన్, సచిన్, సందీప్, అజయ్, రాహుల్, పవన్, శ్రీమాన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 422

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి