కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!

- ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరిన ఆరే రవీందర్

On
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!

ఇందూరు, ఫిబ్రవరి21, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై బుధవారం బాల్కొండ నియోజకవర్గంలోని భింగల్ మండలం మెండోరా సీనియర్ నాయకులు ఆరే రవీందర్ ఇటీవలే బీఆర్ యస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బిజెపిలో చేరారు. IMG-20240221-WA0070

బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, జిల్లా అద్యక్షులు దినేష్ పటేల్ ఆధ్వర్యంలో ఆరే రవీందర్ తో పాటు సుమారు 50 మంది బీఆర్ యస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరారు. వారిని ఎంపీ ధర్మపురి అరవింద్ సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఆరే రవీందర్ తో పాటు బీజేపీలో 50 మంది నాయకులు చేరికతో బాల్కొండ, భింగల్ మండలంలో బీజేపీ మరింత బలపడుతుందని ఎంపీ అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు. IMG-20240221-WA0064

ఆరే రవీందర్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ప్రభుత్వం దేశాభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే బీజేపీలో చేరినట్టు వారు తెలిపారు. బీజేపీ అవలంబిస్తున్న విధానాలు తమని ఆకర్షించడంతో.. పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లో ఉండి ప్రజా సేవ చేయాలనే పార్టీలోకి వచ్చామని స్పష్టం చేశారు. ఇందూరు ఎంపీగా ధర్మపురి అరవింద్  ను భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

IMG-20240221-WA0067 IMG-20240221-WA0062

పార్టీలో చేరిన  వారిలో తక్కురి అంజయ్య, పార్వతి శ్రీనివాస్,బాబురావు,దడువే రవి,అల్లిపు నర్సింగ్,కనక నరసయ్య, సునీల్,వాల్గోట్ బాబురావు,రమేష్,గంగాధర్,బొడిగే లింబద్రి గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్ ,భాస్కర్ ప్రదీప్,గణపతి, వెంకన్న ,సునీల్, గణేష్, సప్పల సురేష్, బాబు, మల్లేష్ గౌడ్, రాంచందర్ గౌడ్, నారాయణ గౌడ్, కుంట సుమన్,రాజేశ్వర్ పటేల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు దినేష్ పటేల్ మరియు బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మల్కన్న గారి మోహన్, భీంగల్ మండల అధ్యక్షులు మహిపాల్, పట్టణ అధ్యక్షులు నర్సయ్య ఉన్నారు..

IMG-20240221-WA0074

Views: 262
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News