ఘనంగా పార్వతి పరమేశ్వరుల 45వ వార్షిక కల్యాణమహోత్సవం..

ప్రత్యేక పూజలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

On
ఘనంగా పార్వతి పరమేశ్వరుల 45వ వార్షిక కల్యాణమహోత్సవం..

IMG-20240314-WA0183 ఘనంగా శ్రీ మహంకాళి అమ్మవారిి జాతర, పార్వతి పరమేశ్వరుల 45వ వార్షిక కల్యాణమహోత్సవం..

IMG-20240314-WA0191
ప్రత్యేక పూజలు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మేట్, మార్చి 14 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమతిపేట్ గ్రామంలోని శ్రీ మాంకాళి అమ్మవారి దేవాలయంలో 45వ శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవనికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలన్నారు. రానున్న రోజుల్లో దేవాలయాలకు ఎటువంటి సాయం కావాలన్నా నా వంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జడ్పిటిసి బింగి దాస్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఎంపిటిసి చేగూరి వెంకటేష్, మాజీ సర్పంచ్ మూల మహేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మూల ప్రవీణ్, తారామతిపేట్ గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Views: 133

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో 258 బూతులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి