పెద్దమ్మ తల్లికి పంచలోహ కీరటం

పంచలోహ కీరటాన్ని ఎన్​ఆర్​ఐ స్టూడెంట్​ గుండెల వినయ్​బాబు బహుకరించారు.

పెద్దమ్మ తల్లికి పంచలోహ కీరటం

IMG-20240515-WA0028

 మహబూబాబాద్​లోని గోపాలపురం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహానికి పంచలోహ కీరటాన్ని ఎన్​ఆర్​ఐ స్టూడెంట్​ గుండెల వినయ్​బాబు బహుకరించారు.  ఈ సందర్భంగా శ్రీ పెద్దమ్మ తల్లి ట్రస్ట్​ కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్​, సలహారుడు సింగని అశోక్​లు మాట్లాడుతూ ట్రస్ట్​ ఛైర్మన్​ గుండెల రాజు, రేణుక దంపతుల పెద్ద కుమారుడు, ఎన్​ఆర్​ఐ స్టూడెంట్​ గుండెల వినయ్​ బాబు శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహానికి పంచలోహ కీరటం బహుకరించినట్లు తెలిపారు. రూ.26వేల విలువైన పంచలోహ కీరటం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అమర్చినారు. పంచలోహ కీరటాన్ని తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన శోభన్​బాబు అనే శిల్పి తయారు చేసినట్లు వివరించారు. అనంతరం వినయ్​బాబును టెంపుల్​ ట్రస్ట్​, నడిగడ్డ, హన్మంతుని గడ్డ ముదిరాజు పెద్దలు ఘనంగా అభినందించి, సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్​ ఛైర్మన్​ గుండెల రాజు, ఉపాధ్యక్షుడు కొండ సారయ్య, కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్​, కోశాధికారి భూముల వెంకన్న,  సలహాదారులు సింగని అశోక్​, అల్వాల వెంకన్న, హన్మంతునిగడ్డ, నడిగడ్డ ముదిరాజు సంఘం అధ్యక్షులు భూం నాగరాజు, కొప్పు ఉప్పలయ్య, కార్యదర్శులు పుచ్చ బాలకృష్ణ, వెములకొండ మల్లేశ్​, కోశాధికారులు తోట శ్రీనివాస్​, భూం నర్సయ్య, పుచ్చ వెంకటయ్య, ట్రస్ట్​ డైరెక్టర్లు, సంఘ సభ్యులు పులుగుజ్జ ఐలయ్య, చెన్నబోయిన సోమయ్య, తోట యాదగిరి, వెములకొండ ఐలయ్య, కట్ల శ్రీనివాస్​, ఉషయ్య, వీరన్,  గుర్రం నరేశ్​, రాజు తదితరులు ఉన్నారు.

Views: 144
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్