విద్యతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు నేర్పించాలి: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..
విద్యతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు నేర్పించాలి: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..
ఎల్బీనగర్, జూన్ 13 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హయత్ నగర్ డివిజన్లోని సూర్య నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన #Pi_the_school_Excellence ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్కూల్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యార్థులకు చిన్నతనం నుంచే మంచి విద్యాబుద్ధులతో పట్టు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కూడా నేర్పించాలని వారు తెలిపారు. అదేవిధంగా పేద మధ్య తరగతి పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఫీజు పరిమితే ఉండాలని ప్రోప్రేటర్ శ్రీనివాస్ కి వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, సూర్య నగర్ కాలనీ ఈస్ట్ అధ్యక్షులు యాదగిరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Comment List