తొర్రూరు పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

తొర్రూరు పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి...

సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రంలో 27 కోట్ల 42 లక్షల రూపాయల వ్యాయామంతో మంచినీటి సరఫరా కై శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు తాగునీటి సమస్యలు తీర్చేందుకే 27 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని అన్నారు, పట్టణ కేంద్రంలో సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ తో పాటు పలు అభివృద్ధి పనులకు మొత్తంగా 62 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వాటిని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పాలకుర్తి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉందని అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకించి నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరడం జరిగిందని దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని అన్నారు త్వరలోనే పాలకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి ప్రారంభిస్తామని అన్నారు

Views: 104
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News