మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్

ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి

On

 

 

 

IMG-20240718-WA1188IMG-20240718-WA1188

Read More నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..

చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సి. ఐ రాయల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులతో గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో పిల్లల భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని, వాటికి దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ నాశనమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. మత్తు పదార్దాల వల్ల జరిగే అనర్దాలను విద్యార్థులు తమ తల్లితండ్రులకు వివరించాలని, మత్తు పదార్దాలకు సంబందించిన సమాచారం తెలిస్తే సమీపంలో పోలీస్‌ వారికి తెలియజేయాలని సూచించారు.

Views: 89
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు