గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకోవాలి

లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి

On

IMG-20240904-WA1301 లక్ష్మీదేవిపల్లి(న్యూస్ ఇండియన్)సెప్టెంబర్3: లక్ష్మీదేవిపల్లి మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలని లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి బుధవారం తెలిపారు . ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలో గల గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతులు తీసుకోవడంతో పాటు , ప్రతిమ ఎత్తు, ప్రదేశం, నిమజ్జనం తేదీ, మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల వద్ద విద్యుత్ ని వినియోగించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మండప నిర్వహకులు ,ఫోన్ నెంబర్ గాల ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు.వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు